రాజరికపు మౌని

అక్కడ
పురజనులు గుమిగూడారు...
వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయబడ్డాయి
జన్మ కుండలి లిఖించబడింది..
అతని కోసం ఓ రాజసౌధం నిర్మించబడింది...

అయితేనేం
తండ్రి అహంకారాన్ని
చవిచూసిన పసి శిశువు
తన ప్రాణము స్త్రీ బిక్షయే కదా అంటూ
వెనుదిరిగి వెళ్ళుటకు సిద్ధమయ్యాడు

అతను మౌని అయ్యాడు
రాజసౌధం కుటీరం అయ్యింది
రాచరికపు చిగురులు
వడలి పోయాయి....

అయినా ఇంకా
అహంకారం
రాజ్యమేలుతూనే ఉంది


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!